![]() |
![]() |
.webp)
మహబూబ్ నగర్ లో పడమటి సంధ్యారాగం టీమ్ అక్కడికి వచ్చిన అశేష ప్రజానీకం మధ్య సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఇక వీళ్ళ మధ్యనే జానకి అత్తా పుట్టినరోజు వేడుకను కూడా నిర్వహించారు. ప్రజలంతా వచ్చి ఈ వేడుకను చూసారు. అలాగే ఈ టీమ్ ని విష్ చేశారు. అలాగే ఇందులో రాము రాథోడ్ స్టేజి మీదకు వచ్చి "రాను ముంబైకి రాను" అనే సాంగ్ పాడి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. అలాగే ఈ ఈవెంట్ లో ఒక అభిమాని వచ్చి మేఘనతో ముచ్చటించారు. అమ్మానాన్న ప్రేమ తరువాత ఫాన్స్ ప్రేమ చాలా ప్యూర్ గా అనిపిస్తుంది. స్టేజి మీదకు వచ్చి చామంతి పూల దండను మేఘన మేడలో వేశారు. "నాకు పుట్టే బిడ్డకు మేఘన అని పేరు పెట్టుకుంటాను" అని చెప్పింది.
తర్వాత మేఘన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. "మా నాన్నను దేవుడు తొందరగా తీసుకెళ్లిపోయాడు. కానీ ఆ ప్రేమను నాకు వీళ్ళ రూపంలో ఇచ్చినందుకు" అని చెప్తూ స్టేజి మీదనే ఏడ్చేసింది. ఇక సీరియల్ లో ఆద్య రామలక్ష్మికి ఒక సర్ప్రైజ్ ని ఈ స్టేజి మీద ఇచ్చింది. ఆద్య మాట్లాడుతూ "రామ డ్రామా జూనియర్స్ లో చాల ఫీలయ్యింది. తన నాన్నతో ఒక్క సెల్ఫీ కూడా లేదు అని. కానీ ఈరోజు నేను ఆమె విష్ ని ఫుల్ ఫీల్ చేద్దామనుకుంటున్నా" అంటూ రామలక్ష్మి వాళ్ళ నాన్నతో కలిసి ఉన్న ఒక ఫోటోని లామినేషన్ చేయించి ఆ స్టేజి మీద ఆద్య రామలక్ష్మికి ఇచ్చింది. తర్వాత రామలక్ష్మి తన పేరెంట్స్ తనకు ఫెవరేట్ అని చెప్పింది. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అంది. అలా మహబూబ్ నగర్ లో పడమటి సంధ్య రాగం సీరియల్ తో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
![]() |
![]() |